ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్...
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. ‘ఇప్పుడు నిర్లిప్తంగా ఉండే సమయం కాదు. రాష్ట్ర ప్రయోజనం కోసం అందరం కలసి ఓ నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుగా రాజీనామా చేస్తారని, వారిలా మీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా? లేదా ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతూనే ఉంటారా? అని జగన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Now is not the time to be partisan, but to take a stand & put Andhra Pradesh first. To secure our rightful demand of SCS, every MP from AP must resign. @ncbn follow YSRCP’s lead & make your MPs resign! Or will you continue to sell AP's interest for a so-called ‘special package’?
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire