హోదా పోరులో వైసీపీ దూకుడు...మరో సంచలన నిర్ణయం దిశగా జగన్‌‌

arun
By arun
Updated on: 24 Dec 2018 1:20 PM IST
హోదా పోరులో వైసీపీ దూకుడు...మరో సంచలన నిర్ణయం దిశగా జగన్‌‌
X

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో ఇవాళ భేటీ అయ్యారు. ఆగిరిపల్లి మండలం ఈదరలో జగన్‌తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీల రాజీనామాతో రాజకీయంగా కలిసొచ్చిందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మరింత మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలలో హోదా అంశాన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది.

arun

arun

Next Story