భర్త ఫోటోని మార్చి ప్రచారమా?అపచారమా?

arun
By arun
Updated on: 24 Dec 2018 2:41 PM IST
భర్త ఫోటోని మార్చి ప్రచారమా?అపచారమా?
X

ఒక మహిళా భర్త ఫోటోని మార్చి అపచారం,

మరో ఫోటోని అచ్చు వేసి పథకాల ప్రచారం,

ఇది ఆమె పేదరికానికి పాట్టిన గ్రహచారమా?

సోషల్ మీడియాలో వైరల్గా ఈ సమాచారం. శ్రీ.కో.


టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కెసిఆర్ మోసపూరిత పథకాలు, ప్రకటనలతో, రాష్ట్ర ప్రజల్ని, దేశాన్ని మోసం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెరాస తప్పుడు పథకాలకు పేద కుటుంబాలు వాడుకుని, ఆ కుటుంబంలో కలతలు రేపుతున్నారని అయన అన్నారు. ఒక మహిళా ప్రక్కన తన భర్తని ఫోటోని మార్చి, మరో ఫోటోని అచ్చు వేసి ఆమె ఆత్మగౌరవాన్ని భంగం వాటిలేట్టు చేసారని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, భాదితురాలు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆదివారం అయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

arun

arun

Next Story