శ్రీదేవి కోసం బోనీ కపూర్ ఏం చేశాడో తెలుసా?

శ్రీదేవి కోసం బోనీ కపూర్ ఏం చేశాడో తెలుసా?
x
Highlights

తన భార్య శ్రీదేవి మరణం నుంచి బోనీకపూర్ ఇంకా కోలుకోలేకపోతున్నాడు. ని ఆమె గుర్తుగా.. ఏదైనా చేయాలని బలంగా ఆరాటపడుతున్న బోనీ.. ముందుగా అతిలోకసుందరి...

తన భార్య శ్రీదేవి మరణం నుంచి బోనీకపూర్ ఇంకా కోలుకోలేకపోతున్నాడు. ని ఆమె గుర్తుగా.. ఏదైనా చేయాలని బలంగా ఆరాటపడుతున్న బోనీ.. ముందుగా అతిలోకసుందరి బయోపిక్ తీద్దామని ప్లాన్ చేశాడు. కానీ.. షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటుందని అప్పుడు అనుకుంటున్నాడు. అందుకోసం.. మూడు టైటిళ్లను కూడా బోనీ రిజిస్టర్ చేశాడట.

శ్రీ, శ్రీదేవి, శ్రీదేవి మ్యామ్.. అంటూ మూడు టైటిళ్లూ తనే రిజిస్టర్ చేయించి.. తన దగ్గరే హక్కులను పెట్టుకున్నాడట బోనీ కపూర్. అలాగే.. చాల్ బాజ్, రూప్ కీ రాణీ చోరోంకా రాజా, జాన్ బాజ్, మిస్టర్ ఇండియా, రిటర్న్ ఆఫ్ మిస్టర్ ఇండియా టైటిళ్లను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కానీ.. శ్రీ, శ్రీదేవి, శ్రీదేవి మ్యామ్ అన్న టైటిళ్ల మీదనే.. బోనీ బాగా ఆరాటపడుతున్నాడని.. శ్రీదేవి జీవితాన్ని షార్ట్ ఫిల్మ్ లో స్వీట్ గా చూపించడమే ఆయన ఇప్పుడు టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై.. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడా… అని అతిలోకసుందరి అభిమానుల్లో ఆరాటం కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories