కొడుకు ప్రేమించాడని..తల్లిపై అత్యాచారం

కొడుకు ప్రేమించాడని..తల్లిపై అత్యాచారం
x
Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆమె...

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో యువకుడి కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆమె కుటుంబసభ్యులు. యువకుడి కుటుంబాన్ని కిడ్నాప్‌ చేయడమేగాక.. అతడి తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు(26), ముజఫర్‌నగర్‌కు చెందిన మరో యువతి(24)ని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ ఘజియాబాద్‌లో చదువుకుంటున్నారు. ఈ ప్రేమికులిద్దరూ నవంబర్ 20న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. మొత్తానికి తమ కూతురు ఆచూకీ వారి తల్లిదండ్రులకు లభించలేదు. ఆ నోట ఈ నోట యువతి తల్లిదండ్రులకు వీరి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో యువకుడి తల్లిదండ్రులు, అన్న, బావను డిసెంబర్ 25న ప్రేమికురాలి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రేమికుడి తల్లిపై యువతి కుటుంబీకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. యువతి ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అరెస్టు అయిన వారిలో యువతి తండ్రి, ఇద్దరు సోదరులు, మాజీ గ్రామ సర్పంచ్ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories