టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో ఇదే..
x
Highlights

- వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు. - నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి చెల్లింపు. - వికలాంగుల పెన్షన్లను...

- వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.
- నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3,016 భృతి చెల్లింపు.
- వికలాంగుల పెన్షన్లను రూ.1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతాం. మిగిలిన అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ 2018 వరకు పొడిగింపు.
- డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉండి, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం.
- రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
- రైతులకు రూ.1 లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ.
- రెతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి చెల్లింపు.
- ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
- చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
- ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మా నం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది. - ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాం. కేంద్రం నుంచి ఆమోదం వచ్చేందుకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుంది.
- వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
- రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు.
- వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
- అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు..
- ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
- ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగాల నియామక వయో పరిమితి మూడేళ్లు పెంపు.
- టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తుంది. ఈ యూనిట్లు తయారు చేసే ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
- కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి, రాష్ట్ర హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తుంది.
- సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు..
- హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేస్తాం.
- అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాల పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు.
- బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు.
- పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు..

Show Full Article
Print Article
Next Story
More Stories