ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు

arun
By arun
Updated on: 24 Dec 2018 1:46 PM IST
ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు
X

బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం బాధకరమన్నారు మంత్రి కేటీఆర్‌. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్‌ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.

arun

arun

Next Story