పార్లమెంట్‌లో ఆందోళన ఉదృతం చేసిన టీడీపీ ఎంపీలు

arun
By arun
Updated on: 24 Dec 2018 12:51 PM IST
పార్లమెంట్‌లో ఆందోళన ఉదృతం చేసిన టీడీపీ ఎంపీలు
X

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. నేటితో పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తున్నందున ఆందోళన మరింత ఉధృతం చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన సూచన మేరకు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ వారు డిమాండ్ చేశారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషంతో ఆందోళనలో పాల్గొన్నారు.

arun

arun

Next Story