‘వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదు?’

‘వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదు?’
x
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి ఇతర పార్టీల మద్దతును వైసీపీ ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పూలే జయంతిని నిర్వహించే హక్కు లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీల చైతన్య యాత్రల తర్వాత బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories