తీవ్ర దుమారం రేపుతున్న టీడీపీ నేత పోస్టు..!

తీవ్ర దుమారం రేపుతున్న టీడీపీ నేత పోస్టు..!
x
Highlights

ఓ టీడీపీ మద్దతుదారుడు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ మాచర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2019లో...

ఓ టీడీపీ మద్దతుదారుడు పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ మాచర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2019లో టికెట్ రాదని, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో పిన్నెల్లి ఓడిపోతారని తేలిందని టీడీపీ ఇన్ ఛార్జ్ చలమారెడ్డి సన్నిహితుడు బ్రహ్మారెడ్డి పోస్ట్ చేశారు. పిన్నెల్లిపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని... మరో సామాజికవర్గ నేతకు టికెట్ ఇచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ తర్వాత అక్కడ రాజకీయ దుమారం రేగింది.

వివాదాస్పదమైన పోస్టును టీడీపీ ఇన్‌చార్జి చలమారెడ్డి సన్నిహితుడైన బ్రహ్మారెడ్డి పెట్టినట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన పార్టీకి చెందిన ఒక కార్యకర్త సెల్‌నుంచి తనకు ఫోన్‌చేసి ఇలాంటి పోస్టులు పెడితే చంపుతానని బెదిరించాడని బ్రహ్మారెడ్డి తండ్రి వీరారెడ్డి మాచర్ల అర్బన్‌ సీఐ సాంబశివరావుకు ఫిర్యాదుచేశారు. తమ వద్ద వాయిస్‌ రికార్డు కూడా ఉన్నట్లు సీఐకి చెప్పారు. ఫిర్యాదుతోపాటు వాయిస్‌ రికార్డు కూడా ఇవ్వమని సీఐ వారికి సూచించారు. దీనిపై పిన్నెల్లి స్పందిస్తూ, చంపుతానని తాను బెదిరించినట్టు రుజువు చేస్తే కేసు పెట్టుకోవచ్చని చెప్పారు. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐని కలిశారు. రెండు దశాబ్దాల పాటు వీరారెడ్డి తన వద్దే ఉన్నాడని, ఆ తర్వాత పార్టీ మారారని సీఐకి తెలిపారు. తనపై పోస్ట్ పెట్టిన బ్రహ్మారెడ్డికి ఫోన్ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందనే భావనతో... ఒకప్పుడు తనతో చనువుగా ఉన్న అతని తండ్రి వీరారెడ్డికి ఫోన్ చేశానని... ఇలాంటివి అనవసరమని మాత్రమే అన్నానని పిన్నెల్లి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories