సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై.. ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ స్థాయి పంచాయితీకి ఎక్కువ.. మండలానికి...

రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై.. ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ స్థాయి పంచాయితీకి ఎక్కువ.. మండలానికి తక్కువ అన్నారు. ఎన్నికల్లో గెలిచే సీన్ లేని సీఎం రమేష్‌కు.. గ్రూపు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాలను కూడా.. సీఎం రమేష్ ఓడిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దయవల్లే సీఎం రమేష్ ఎంపీ అయ్యారని చెప్పారు వరదరాజులు. వైసీపీ అధినేత జగన్‌తో సీఎం రమేష్ టచ్‌లో ఉన్నారని మరో బాంబ్ పేల్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories