కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

arun
By arun
Updated on: 24 Dec 2018 1:17 PM IST
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
X

కావేరి బోర్డు ఏర్పాటులో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల మూడులోపు కావేరి బోర్డు ముసాయిదాను తమకు సమర్పించాలంటూ ఆదేశించింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు రైతులు వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్ధానం గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. తక్షణమే కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించిన కోర్టు కేనును వచ్చే నెల మూడుకు వాయిదా వేసింది.

arun

arun

Next Story