శబరిమల ఆలయాన్ని శాశ్వతంగా మూసేస్తాం : ప్రధాన అర్చకులు హెచ్చరిక
గతకొద్దీ రోజులుగా అత్యంత వివాదాస్పదంగా మారిన శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశం అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీరియస్ తీసుకున్నారు. ఒకవేళ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, ఆలయానికి తాళం వేస్తామని, తాళంచెవులను అప్పగించి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదు అని, భక్తుల వైపున తాను నిలబడనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో తన వద్ద ఎటువంటి ఆప్షన్ లేదన్నారు. ప్రధాన అర్చకుల హెచ్చరికతో వెనుదిరిగారు మహిళలు.
Next Story




