మతమార్పిడి చేస్తున్న దంపతులు అరెస్ట్

x
Highlights

హైదరాబాద్‌లో మరో మత మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. వెనుకబడిన, గిరిజన బాలబాలికలే లక్ష్యంగా మత మార్పిడి చేస్తున్న దంపతులను రాచకొండ పోలీసులు అరెస్ట్...

హైదరాబాద్‌లో మరో మత మార్పిడి ముఠా గుట్టు రట్టయింది. వెనుకబడిన, గిరిజన బాలబాలికలే లక్ష్యంగా మత మార్పిడి చేస్తున్న దంపతులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పర్వతాపూర్‌లోని ఒక ఆశ్రమంలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాచకొండ పోలీసులు దాడి చేశారు. 14 ఏళ్లలోపు ఉన్న 9 మంది బాలబాలికలను మతమార్పిడి గ్యాంగ్ బారి నుంచి రక్షించారు. బాధితులు సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు.

కడపకు జిల్లాకు సంజీవయ్య దంపతులు పర్వతాపూర్‌ వేదికగా నజరేత్‌ ఆర్ఫన్‌ చిల్డ్రన్‌ అండ్‌ హోం నిర్వహిస్తున్నారు. వీరు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సూర్యాపేట, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన వెనుకబడిన, గిరిజన హిందూ మైనర్లకు ఉచితంగా ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తామని నమ్మించి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. తర్వాత వారిని క్రైస్తవ మతంలోకి మార్చి ఆ మతబోధనలు చేస్తున్నారు. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేయడంతో ఈ తంతు బయటపడింది.

సంజీవయ్య దంపతులు అప్పటికే 16 మంది బాలబాలికల మతం మార్చి క్రైస్తవ బోధనలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పైగా 16 మంది మైనర్లను ఒకే గదిలో ఉంచినట్లు తెలుసుకున్నారు. ఒకే గదిలో ఇంతమంది బాలలను ఉంచడం జువైనల్‌ చట్టం ప్రకారం నేరమని పోలీసులు అంటున్నారు. మతమార్పిడికి పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. చిల్డ్రన్‌ అండ్‌ హోంలోని క్రైస్తవ గ్రంథాలను, ఆ మతానికి సంబంధించిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల 17మందిని మైనర్లను అక్రమంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే మరో ముఠా బాగోతం బయటపడటం కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories