రాహుల్‌ వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే : రఘువీరా రెడ్డి

arun
By arun
Updated on: 24 Dec 2018 12:56 PM IST
రాహుల్‌ వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే : రఘువీరా రెడ్డి
X

రాహుల్ ప్రధాని కాగానే ఏపీ ప్రత్యేకహోదా పైనే తొలి సంతకం చేస్తారని రఘువీరా రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష‌’లో పాల్గొన్న రఘువీరా ఈనెల రోజులు అత్యంత కీలకమని అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ పోరాట సెగ కేంద్ర ప్రభుత్వానికి తగలాలన్నారు. హోదాకు అనుకూలంగా లేని వారంతా ఆంధ్రా ద్రోహులేనని విమర్శించారు. కేంద్రంతో టీడీపీ-వైసీపీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు.

arun

arun

Next Story