ఆప్తుల అశ్రునయనాల మధ్య  ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు

nanireddy
Updated on: 24 Dec 2018 3:22 PM IST
ఆప్తుల అశ్రునయనాల మధ్య  ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు
X

మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత, ప్రఖ్యాత గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు... అశ్రునయనాల మధ్య ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో విశాఖలోని గీతం యూనివర్సిటీకి సమీపంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఎంవీవీఎస్ మూర్తి చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పటించారు. అశేష జనవాహిని, గీతం విద్యార్థులు కన్నీటి వీడ్కోలు మధ్య సాగిన అంతిమయాత్రలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

nanireddy

nanireddy

Next Story