టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ సస్పెన్షన్‌

టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ సస్పెన్షన్‌
x
Highlights

టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన రాములు నాయక్‌పై గులాబి దళం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం...

టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన రాములు నాయక్‌పై గులాబి దళం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఇల్లెందు నుంచి టికెట్ ఆశిస్తున్న రాములు నాయక్ గత కొద్ది కాలంగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. నిన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ ‌కుమార్ రెడ్డితో సమావేశమయిన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి అధినాయకత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 20న కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories