కూకట్ పల్లిలో ఇంచార్జిల నియామకం..

కూకట్ పల్లిలో ఇంచార్జిల నియామకం..
x
Highlights

తెలంగాణలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ ఇంచార్జిలను నియమించి ప్రచార సరళిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో...

తెలంగాణలో ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ ఇంచార్జిలను నియమించి ప్రచార సరళిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ఇంఛార్జిగా ఏపీ మంత్రి పరిటాల సునీతను ఆ పార్టీ నియమించింది. గత రెండు రోజులుగా ఆమె నగరంలోనే ఉంటూ కూకట్ పల్లి అభ్యర్థిని నందమూరి సుహాసిని తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇదే నియోజకవర్గానికి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డిని ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఏలూరి రామచంద్రారెడ్డి కూకట్ పల్లి సీటును ఆశించారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీకి త్యాగం చేయవలసి వచ్చింది. దాంతో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం శ్రమిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆరెస్ కూడా ఇక్కడ ఇద్దరు ఇంచార్జిలను నియమించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories