జగన్.. అధికారులకు సహకరించకపోవడంపై.. మంత్రి లోకేష్ ఫైర్..

nanireddy
Updated on: 24 Dec 2018 3:39 PM IST
జగన్.. అధికారులకు సహకరించకపోవడంపై.. మంత్రి లోకేష్ ఫైర్..
X

జగన్ సిట్ అధికారులకు సహకరించకపోవడంపై.. మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏపీ పోలీసుల విచారణలో కోడి కత్తి డ్రామా వెనుక నిజాలు బయటపడతాయనే.. జగన్‌, మోడీకి భయం పట్టుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్రం నిర్వీర్యం చేసిన మోడీ బ్యూ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ద్వారా నాటకాన్ని రక్తి కట్టించి..
టీడీపీపై నిందలు వేయాలని జగన్‌ కలలు కంటున్నారని ఆరోపించారు. ఏపీ రాష్ట్ర వ్యవస్థలను, అధికారులను కించపరుస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న జగన్‌, మోడీకి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

nanireddy

nanireddy

Next Story