పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ. నడిచిన తండ్రి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను వణికించిన తితలీ తుఫాన్ ఒడిశా లోని గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. ఈ ...
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను వణికించిన తితలీ తుఫాన్ ఒడిశా లోని గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. ఈ జిల్లాలో తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో అతంక్పూర్ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. నాలుగురోజుల క్రితం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. అయితే ఆమె గ్రామానికి సమీపంలో కొండచరియలు విరిగి మృతిచెందినట్టు తెలిసింది. దాంతో కూతురు మృతితో కన్నీరు మున్నీరైనా ముకుంద్ తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఫొటోలు తీసుకుని... పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్కు తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ముకుంద్ కుటుంబం. ఇక చేసేది లేక ముకుంద్.. బబిత మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని హాస్పిటల్కు బయలుదేరాడు. 8కిమీ.లు నడిచిన తర్వాత కొందరు స్థానికులు ఈ విషయంపై ఆరాతీస్తే.. వాహనం సమకూర్చుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇలా రావలసి వచ్చిందని చెప్పాడు. దాంతో చలించిన గ్రామస్థులు కొందరు.. వెంటనే వాహానం ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించారు. బబిత ఘటనపై విమర్శలు చెలరేగడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMT