మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

nanireddy
Updated on: 24 Dec 2018 3:31 PM IST
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం
X

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గోద్రా సమీపంలో రైల్వే గేటును దాటుతున్న ఓ ట్రక్కుని త్రివేండ్రం నుంచి వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోగా.. వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. కాగా ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే అన్నట్టు తెలుస్తోంది. ట్రక్‌ డ్రైవర్‌ గేటును గమనించకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనతో గోద్రా రత్లాం రూట్‌లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

nanireddy

nanireddy

Next Story