టిక్కెట్ కొని సినిమా చూసిన మొహమేనా నీది

టిక్కెట్ కొని సినిమా చూసిన మొహమేనా నీది
x
Highlights

టాలీవుడ్ పై టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మా అధ్యక్షుడు శివాజీ రాజా,...

టాలీవుడ్ పై టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మా అధ్యక్షుడు శివాజీ రాజా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ లు మండిప‌డ్డారు.
టాలీవుడ్‌ను టార్గెట్‌‌ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ మన హీరోలకు పోరాడే చేవ చచ్చిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతుంటే ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
జల్లికట్టును నిషేధిస్తే తమిళ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉద్యమించిందని కానీ టాలీవుడ్‌ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బానిస బతుకులు ఇంకెన్నాళ్లన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఇకనైనా ఆంధ్రుల హక్కుల కోసం నడుంబిగించాలన్నారు. లేకపోతే తెలుగు సినీ పరిశ్రమను బహిష్కరిస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదంటూ టాలీవుడ్‌ పెద్దలను టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అసలు టాలీవుడ్‌కి ఏమైందని అడిగారు? పోరాడే చేవ చచ్చిపోయిందా? అని నిలదీశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత సహా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఏపీ పోరాటానికి మద్దతు పలుకుతుంటే అక్కడే ఉంటున్న టాలీవుడ్‌ పెద్దల్లో ఒక్కరూ మాట్లాడటకపోవడం శోచనీయమన్నారు. తమిళ నటీనటులను చూసైనా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ఉద్యమించకపోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు.
అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన శివాజీరాజా విజయవాడలో ఉండే రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తిది ఎపుడైనా టిక్కెట్ కొని సినిమా చూసిన మొహమేనా అంటూ మండిపడ్డారు. దేవుడితో సమానమైన ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నీచమైన కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రాజకీయ నాయకుల్లోనే స్పష్టత లేదన్నారు.
ఒక రోజు ప్రత్యేక హోదా కావాలంటారు.. మరో రోజు డబ్బులు కావాలంటారు. ఇలా మీలోనే ఓ క్లారిటీ లేదనీ, ఇక మాకేం క్లారిటీ ఉంటుందని నిలదీశారు. పైగా, మా ప్రొఫెషన్ అది కాదనీ, ఏదో ఓ మంచి సినిమా తీయడమని శివాజీ రాజా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories