పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ గొంతుకోసిన యువకుడు

పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ గొంతుకోసిన యువకుడు
x
Highlights

పెళ్లిచేసుకునేందుకు యువతి నిరాకరించడంతో ఓప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆమెను చిత్రహింసలకుగురిచేసి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడు.ఈ ఘటన...

పెళ్లిచేసుకునేందుకు యువతి నిరాకరించడంతో ఓప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఆమెను చిత్రహింసలకుగురిచేసి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడు.ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో
చోటుచేసుకుంది.తంజావూర్ జిల్లా పాపనాశం శివాలయం వద్ద వసంతప్రియ(25) నివాసం. కుంభకోణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వసంత ప్రియను తనకు ఇచ్చి
వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులను, సమీప బంధువు నందకుమార్ అడిగాడు. కాగా దీనికి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. వెంటనే మరో యువకుడితో వచ్చే ఏడాది
జనవరిలో పెళ్లి ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో యువతిపై కక్ష పెంచుకున్న నందకుమార్ ఆమె రాకపోకలపై దృష్టి పెట్టాడు..ప్రియ స్కూలు నుంచి తిరిగివస్తున్న సమయంలో ఆమెను అడ్డగించి కత్తితో గొంతు
కోశాడు. ఒక్కసారిగా ప్రియ నేలపై కుప్పకూలిపోవడంతో నందకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు
తేల్చిచేప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నందకుమార్ ను అరెస్ట్ చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories