
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టాలని,...
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తాజాగా కేసీఆర్పై అభిమానంతో ఓ యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టాడు. నెలూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి కేటీఆర్ వీరాభిమాని. తన గుండెపై కేటీఆర్ రూపాన్ని టాటూగా వేయించుకున్నాడు. గులాబీ దుస్తుల్లో విజయవాడ నుంచి కాలినడకన హైదరాబాద్కు బయలుదేరాడు. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ట్వీటర్ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఏపీకి చెందిన రోహిత్.. కేసీఆర్, టీఆర్ఎస్కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Many thanks Rohit Kumar Reddy for your love & solidarity
— KTR (@KTRTRS) October 8, 2018
Rohit, who’s a native of AP is walking all the way from Vijayawada to Hyderabad garnering support for KCR Garu & TRS #TelanganaWithKCR https://t.co/HuyPxI4IgC

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire