ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో ముగిసిన కేసీఆర్ భేటీ

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల...
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. ముందుగా విశాఖ నుంచి భువనేశ్వర్ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కేసీఆర్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతకుముందు విశాఖ విమనాశ్రయం నుంచి కేసీఆర్ నేరుగా శారదాపీఠం వెళ్లారు. అక్కడ పీఠం ప్రతినిధులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులందుకున్నారు. అక్కడ నుంచి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ చేరుకొని.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యతకపై చర్చ జరిగింది. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడారు.. దేశ రాజకీయాలపై తమ మధ్య చర్చ జరిగిందన్నారు నవీన్ పట్నాయక్.. భావ స్వారూప్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT