‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’

‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’
x
Highlights

నల్లగా ఉన్నావంటూ ఎగతాళి చేసినందుకు ఓ మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. తినే ఆహారంలో విషం కలిపి ఐదుగురిని...

నల్లగా ఉన్నావంటూ ఎగతాళి చేసినందుకు ఓ మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాన్ని శవాలదిబ్బగా మార్చేసింది. తినే ఆహారంలో విషం కలిపి ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్‌ జ్యోతి సురేష్‌ సర్వసేకు రెండేళ్ల​ క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని, వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి మీద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది.

కాగా ఈ నెల 18న మహడ్‌ గ్రామానికి చెందిన సుభాష్‌ మణే అనే ఓ బంధువు తన గ్రామంలో ఒక వేడుక నిర్వహించాడు. జ్యోతి తన అత్తింటి వారితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యింది. అత్తగారి కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ వేడుకే మంచి అవకాశంగా భావించింది జ్యోతి. అతిథుల కోసం సిద్ధం చేసిన భోజనంలో విషం కలిపింది. ఈ విషాహారం తినడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 7 - 13 ఏళ్ల వయసు పిల్లలు నలుగురితో పాటు ఓ 53 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నా‍రు. విషయం తెలిసుకున్న ఖాలాపూర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆహార పదర్ధాలను పరీక్షించడం కోసం ఫోరెన్సీక్‌ లాబ్‌కు పంపించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories