రాచకొండ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ గ్యాంగ్ సభ‌్యులు

రాచకొండ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ గ్యాంగ్ సభ‌్యులు
x
Highlights

ఆరు రాష్ట్రాల పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను...

ఆరు రాష్ట్రాల పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని దావోడ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 10 తులాల బంగారం, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 18న వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలించారు.

చెడ్డీగ్యాంగ్ అలియాస్ కచ్చాబనియన్ గ్యాంగ్. ఈ పేరు వింటే చాలు తెలుగురాష్ట్రాల ప్రజలు హడలిపోతారు. చెడ్డీలపై అర్ధనగ్నంగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టైల్‌. తమ దోపిడీలకు అడ్డొస్తే క్షణంలో అంతం చేయడం పోలీసులకు చిక్కకుండా తప్పించుకోడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. శివారు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా ఉనికి నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో బయటపడింది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలో వీరి దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శివారు ప్రాంతాలతో పాటు అనుమానం ఉన్న ప్రాంతాల్లో గస్తీ పెంచారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ నగరం వదిలి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరిపి ముఠా గుజరాత్‌లో
సంచరిస్తున్నట్టు గుర్తించారు.

దాదాపు నెల పాటుగుజరాత్‌లో తిష్టవేసిన పోలీసులు ఎట్టకేలకు చెడ్డీగ్యాంగును పట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంచరించిన వారి ఫోటోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 20 మంది సభ్యులున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు ఈ దిశగానే విచారణ ముమ్మరం చేశారు. 1999లో తమ కార్యకలపాలను ప్రారంభించిన చెడ్డీగ్యాంగు దాదాపు ఆరు రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తోంది.ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ముంబయి బోరివెల్లిలో 2016 ఫిబ్రవరి 18 న
పోలీసులకు చిక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories