తెలంగాణలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ఖరారు
త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు కోట్ల 73 లక్షల 18 వేల 603 ఓటర్లున్నారు. ఇందులో పురుషులు కోటీ 37 లక్షల 87 వేల 920 మంది ఉండగా… కోటీ 35 లక్షల 28 వేల 20 మంది మహిళలున్నారు. 2 వేల 663 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లుండగా.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 9 వేల 451. మరోవైపు ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి వేసిన పిటిషన్పై ఈనెల 31న విచారణ జరగనుంది. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న శశిధర్రెడ్డి… ఓటర్ లిస్ట్లో అధికారులు తప్పులు చేశారని అయన ఆరోపిస్తున్నారు.
Next Story




