ఈ ఆహారం కలిపి తింటే.. అంతే సంగతులు!

ఈ ఆహారం కలిపి తింటే.. అంతే సంగతులు!
x
Highlights

ఆహారంలో కొన్ని కాంబినేష్లు భలే క్రేజీగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లేకపోతే తినడమే కష్టమనే భావం కూడా ఏర్పడుతుంది. అయితే, కొన్ని కాంబినేష్లు ఎంత రుచిగా ఉంటాయో...

ఆహారంలో కొన్ని కాంబినేష్లు భలే క్రేజీగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లేకపోతే తినడమే కష్టమనే భావం కూడా ఏర్పడుతుంది. అయితే, కొన్ని కాంబినేష్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా.. క్రమేనా విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. మరి, ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలేమిటో చూద్దామా...

పుచ్చకాయ, నీళ్లు: పుచ్చకాయలో దాదాపు 90 నుంచి 95 శాతం నీరే ఉంటుంది. ఇది తిన్న తర్వాత నీళ్లు తాగితే.. శరీరంలోని జీర్ణ రసాలపై దుష్ర్పభావం చూపుతుంది.

టీ, పెరుగు: ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసు కోవడం వల్ల శరీరం సమతుల్యత కోల్పోతుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతోంది.

పాలు, అరటి పండు: ఆయుర్వేద నిపుణులు దీన్ని పూర్తిగా వ్యతి రేకిస్తారు. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది

పెరుగు, పండ్లు: పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి

మాంసం, పాలు: పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తినకూడదు

పాలు, నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది.

పాలు,యాంటిబయోటిక్స్: ఐరన్, కాల్షియం వంటి యాంటి బయోటిక్స్ తీసుకున్నప్పుడు కాసేపు ఆహారం తీసుకోకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories