మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి

మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి
x
Highlights

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటాను గోడ మీద పిల్లిలా పోల్చారు. గంటాకు డబ్బే ప్రధానమని, ఏ పార్టీ...

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటాను గోడ మీద పిల్లిలా పోల్చారు. గంటాకు డబ్బే ప్రధానమని, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. నీతి లేని గంటాకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. విశాఖలో చంద్రబాబు నిర్వహించింది ధర్మపోరాట సభ కాదని అధర్మ పోరాట సభ, అన్యాయమైన సభ అని విమర్శించారు. రాజకీయ సభలను యూనివర్శిటీలలో నిర్వహించరాదన్న జీవో ఉన్నప్పటికీ... యూనివర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ లు నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories