బీజేపీకి యశ్వంత్‌ సిన్హా గుడ్‌బై

బీజేపీకి యశ్వంత్‌ సిన్హా గుడ్‌బై
x
Highlights

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన......

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ , తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాగా, 2002-04 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖా మంత్రిగా, 1998-2002 లో ఫైనాన్స్ మినిస్టర్ గా యశ్వంత్ సిన్హా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా జయంత్ సిన్హా పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories