రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురిని కాల్చివేత

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురిని కాల్చివేత
x
Highlights

అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య...

అసోం వేర్పాటువాద సంస్థ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఒకరి తరువాత మరొకరిపై తుపాకులతో కాల్పులకు పాల్పడి హతమార్చారు. ఆ తర్వాత వారి శవాలను బ్రహ్మపుత్ర నదీ తీరంలో పడేసి వెళ్లిపోయారు. కాగా గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ ఐదుగురు యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. వారికోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా వారి మృతదేహాలు నదీ తీరంవద్ద ఉండటంతో తీవ్రంగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులేనని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజనాధ్ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories