మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. బీపీ డౌన్ అయింది, ప్రస్తుతం అయన భువనగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మోత్కుపల్లి బీఎల్ఎఫ్ తరపున ఆలేరు నుంచి బరిలో ఉన్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురైనట్లు తెలిసిన వెంటనే బీఎల్ఎఫ్ కార్యకర్తలు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు.
Next Story




