మడతబెట్టే ఫోన్.. ఫీచర్స్ చూస్తే..

మడతబెట్టే ఫోన్.. ఫీచర్స్ చూస్తే..
x
Highlights

మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. లార్జ్ బేసిక్ ఫోన్ దశ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. తాజాగా...

మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. లార్జ్ బేసిక్ ఫోన్ దశ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. తాజాగా మొబైల్ ఫోన్ రంగంలో మరో కీలక నైపుణ్యం వచ్చి చేరింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను చైనాకు చెందిన రాయొలే కార్పొరేషన్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని సంవత్సరాలుగా మడతబెట్టే స్మార్ట్ ఫోన్ కోసం దిగ్గజాలైన శామ్‌సంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో. రాయొలే ఈ ఫోన్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరుతో తీసుకొచ్చిన శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్

7.8 అంగుళాలతో మినీ ట్యాబ్‌లా ఉండే ఈ ఫోన్‌ను సగానికి మడతబెట్టొచ్చు. మడిచిన తర్వాత ఇది డ్యుయల్‌ స్క్రీన్‌ స్మార్ట్‌ ట్యాబ్ లా కనిపిస్తుంది. ఇందులో రెండు కెమెరాలుంటాయి. ఒకటి 20మెగాపిక్సెల్‌ టెలిఫొటో లెన్స్‌తో పాటు మరొకటి 16మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌లు. ఈ రెండు కెమెరాలు వెనుకవైపే ఉన్నాయి. దాదాపు 2లక్షల సార్లు పరీక్షించిన తరువాత చైనా సంస్థ ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మరికొన్ని ఫీచర్లు ఇలా ఉన్నాయి. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8150 ప్రాసెసర్‌, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్‌, 128జీబీ/256జీబీ/512జీబీ అంతర్గత మెమొరీ, 3,800ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,318 డాలర్లు, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సామర్థ్యం గల ఫోన్‌ ధర 1,469డాలర్లుగా నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories