‘ఫెడరల్ ఫ్రంట్’పై కేసీఆర్ వ్యూహాం

‘ఫెడరల్ ఫ్రంట్’పై కేసీఆర్ వ్యూహాం
x
Highlights

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ వేగం పెంచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన...

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ వేగం పెంచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌‌ యాక్షన్ మొదలుపెట్టారు. చెప్పినట్లుగానే ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్‌‌ మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌‌, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ను కలవనున్నారు.టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు నుంచి ఫెడరల్ టూర్ చేపట్టారు. ముందుగా విశాఖ వెళ్లనున్న కేసీఆర్‌‌ శారదా పీఠాన్ని సందర్శించి, రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తారు. సాయంత్రం ఒడిషా సీఎం నవీన్‌ ‌పట్నాయక్‌తో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారు.

రాత్రికి ఒడిషా సీఎం అధికార నివాసంలో బస చేయనున్న కేసీఆర్‌‌ రేపు ఉదయం కోణార్క్‌ దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వెళ్లనున్న కేసీఆర్‌‌ రేపు సాయంత్రం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. రేపు రాత్రి హస్తినకు వెళ్లనున్న కేసీఆర్‌‌. మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కలిసి తెలంగాణ సమస్యలపై, పెండింగ్‌ ఇష్యూస్‌‌పై మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఢిల్లీ టూర్‌లోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తోనూ సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరపనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories