రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ.. పాడుకున్న వ్యక్తి ఎవరంటే..

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ.. పాడుకున్న వ్యక్తి ఎవరంటే..
X

భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో బాలాపూర్ లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ.. వేలం పాటలో రికార్డు ధర పలికింది. రూ.16 లక్షల 60వేలకు శ్రీనివాస్‌గుప్తా అనే వ్యక్తి లడ్డూను సొంతం చేసుకున్నాడు. గతేడాది కంటే లక్ష ఎక్కువ ధర పలికింది. వేలంపాటలో 12 మంది పాల్గొనగా.. అత్యధిక ధర చెలించి శ్రీనివాస్‌గుప్తా లడ్డూను కైవసం చేసుకున్నాడు. . కాగా 1994లో లడ్డూకు వేలంపాట నిర్వహించగా కొలను మోహన్ రెడ్డి 450రూపాయలకు సొంతం చేసుకున్నారు. క్రమంగా లడ్డూ విలువ పెరుగుతూ 2016 నాటికి అది రూ.15లక్షల 65 వేలకు చేరింది. ఈ ఏడాది 16లక్షల60వేలు పలికింది.

nanireddy

nanireddy

Next Story