8 నెలల పాపను రేప్‌ చేసిన బంధువు

8 నెలల పాపను రేప్‌ చేసిన బంధువు
x
Highlights

దేశరాజధానిలో మరో దారుణ సంఘటన. ఎనిమిది నెలల పసిగుడ్డుపై దగ్గరి బంధువే లైంగికదాడిచేశాడు. రక్తపుమడుగులో పడిఉన్న పాపను తల్లిదండ్రులు ఆస్పత్రిలో...

దేశరాజధానిలో మరో దారుణ సంఘటన. ఎనిమిది నెలల పసిగుడ్డుపై దగ్గరి బంధువే లైంగికదాడిచేశాడు. రక్తపుమడుగులో పడిఉన్న పాపను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. పశ్చిమఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో చోటుచేసుకున్న ఈఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..నార్త్‌వెస్ట్‌ దిల్లీకి చెందిన దంపతులు స్థానికంగా నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు.ఈ క్రమంలో రోజువారీ పనుల కోసమని ఆ దంపతులు ఆదివారం బయటకి వెళ్లారు. పిల్లలను అదే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలో పాపకు సమీప బంధువైన 28ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి అదే బిల్డింగ్‌లో వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై, పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది చూసి భయపడిన నిందితుడు పాపను అక్కడే వదిలి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆమె తల్లి పరిస్థితిని గమనించి వెంటనే తన భర్తకు, ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఆ వ్యక్తి కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టి పట్టుకున్నారు. విచారణలో అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories