మరో ఇద్దరు పూజారుల సంగతేంటి?

admin
Updated on: 24 Dec 2018 12:21 PM IST

చదువలమ్మ అదృశ్యం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు పూజారులపై బాసర పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయ్. అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహం దేవరకొండ తీసుకెళ్లి.. పూజలు నిర్వహించిన వారిలో మరో ఇద్దరు పూజారులున్నారు. అందులో ఒకరు గాయత్రి దేవాలయ పూజారివిశ్వజిత్ కాగా మరొకరు... ఆర్య వైశ్య సత్రంలో ఉండే కృష్ణ. అయితే వీళ్ల ఇద్దరిపై ఆలయ అధికారులు కేసు ఫైల్‌ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. అమ్మవారి ఉత్సవ విగ్రహం తరలింపులో వీరి పాత్ర ఉందన్నది కచ్చితం. కానీ వీళ్లను తప్పించడానికి ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అయితే ఉత్సవ విగ్రహం తరలింపుతో సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తప్పవంటున్నారు ఈవో.

అమ్మవారి ఆలయం నుంచి అత్యంత పవిత్రంగా, అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఉత్సవ విగ్రహం తీసుకెళ్లినప్పుడు ఆలయ ఇన్‌స్పెక్టర్‌కు, సూపరింటెండెంట్‌కు తెలుసంటున్నారు పూజారులు. అయినా వాళ్ల మీద చర్యలు తీసుకోలేదు. కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి దందాలకు పాల్పడుతున్న ఆలయ అధికారులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తన్నారు.

ఉత్సవ విగ్రహాల‌ను ఊరి పొలిమేర దాటించాలంటే అదో పెద్ద తంతు. దానికి సిద్ధాంతులు, ఈఓ అనుమ‌తులు త‌ప్పనిస‌రి. కానీ ఎలాంటి అనుమ‌తులు లేకుండా, సిద్ధాంతులు, పీఠాధిపతుల సూచ‌న‌లు లేకుండా విగ్రహం తరలివెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇంత పెద్ద ఇష్యూ అధికార పెద్దల హస్తం లేకుండా జరిగి ఉంటుందా? సమగ్ర విచారణతోనో, సస్పెన్షన్లతోనో సరిపెడితే అసలు నిజాలు దాగవు. పేర్లు బయటకు రాని వాస్తవాలు బాసరలో ఎన్నో ఉన్నాయ్‌. అవి బయటకు పొక్కితేనే కానీ అసలు సంగతేంటో తేలదు. అప్పటి దాకా బాసరమ్మకు ఈ బందీ బాధలు తప్పవ్‌.

admin

admin

Next Story