TNGO News: ఏడేళ్లుగా ఉద్యోగుల పీఆర్సీ పెండిగ్ లోనే: టీఎన్జీవో అధ్యక్షుడు

HMTV
By HMTV
Published on: 2020-08-31 13:35:37

మామిళ్ల.రాజేందర్ నూతన టీఎన్జీవో అధ్యక్షుడు: 11వ TNGO అధ్యక్షుడుగా నాకు అవకాశం ఇచ్చారు.

నన్ను ఎన్నుకున్న 33 జిల్లాల అధ్యక్షులకు ఉద్యోగులందరికి ధన్యవాదాలు.

ఇకముందు ప్రభుత్వం తో అరమరికలు లేకుండా పోరాటం చేస్తాము.

ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీలు వెంటనే ఇవ్వండి.

ఉద్యోగుల మూడు డీఏలు పెండిగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలి.

ఆంధ్రలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలి.  

సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తాము.

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలు అన్నిచేస్తున్నారు ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నా.

మా మొరను కేసీఆర్ ఆలకించాలని వేడుకుంటున్న

కేసీఆర్ బోలా శంకరుడు..ఏది కోరినా ఇస్తాడు.. మాకు రావాల్సిన రాయితీలన్ని ఇవ్వండి.

7ఏండ్లుగా ఉద్యోగుల పీఆర్సీ పెండిగ్లో ఉంది.

ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయండి.

కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి ఒక్క అర్ద గంట సమయం కేటాయించి మా గోడు వినండి.

ఉద్యోగులు కష్టపడి చేస్తుంటేనే రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది.

త్వరలోనే ఉద్యోగసంఘాల సమావేశం పెట్టికుని సమస్యలపై చర్చిస్తాము. 

HMTV

HMTV

Next Story