Revanth Reddy: ఏ.రేవంత్ రెడ్డి,ఎంపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

- శ్రీశైలం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.

- ఘటన పై సీబీఐతో విచారణ

- ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్.

- శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.

- వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.

- మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

- మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

- ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలి.

- ఈ ఘటన పై అనేక అనుమానాలు ఉన్నాయి.

- జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరిస్తూ... శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ప్రాజెక్టును చంపేసే కుట్ర చేస్తున్నాడని చాలా కాలంగా మేం చెబుతున్నాం.

- దుర్ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- రాష్ట్ర పరిధిలోని విచారణ సంస్థలతో కాక... కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను.

Show Full Article
Print Article
Next Story
More Stories