NTR Bhavan updates: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష జరిగింది..

ఎల్.రమణ టీటీడీపీ అధ్యక్షులు @ ఎన్టీఆర్ భవన్

-వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల సమస్యల తో పాటు హైదరాబాద్ నగరంపై పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరగడం పై టీడీపీ సమీక్ష   జరిగింది..

-గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి నష్టపరిహారం ఇచ్చేవారని ప్రస్తుతం ఎవరు చేయడం లేదు...

-సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆరు సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్సు రాని పరిస్థితి ఏర్పడింది...

-లక్షల ఎకరాల్లో వరి పత్తి పంటలు వరదల్లో మునిగి పోయాయి...

-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి...

-నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి...

-రైతుల కోసం టిడిపి ధర్నాలు నిరసన దీక్షలు చేస్తుంది...

-హైదరాబాద్ లో 180 చెరువులు మరమ్మత్తు చేస్తామని నాళాలను రిపేర్ చేస్తామని 30 వేళా కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదు...

-ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories