National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..

జాతీయం..

-కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి అనిల్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు

-పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని వినతి

అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి..

- రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు

- వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు

- 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం

- పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలి

- నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామన్నారు

- కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను

- అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు

- ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు

Show Full Article
Print Article
Next Story
More Stories