National updates: రాజ్యసభలో విజయసాయిరెడ్డి - టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మధ్య వాగ్వాదం..

జాతీయం..

-Covid 19 చర్యలపై రాజ్యసభలో చర్చ సందర్భంగా చోటు చేసుకున్న మాటల యుద్ధం.

-కరోనా నియంత్రణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ ఇతర అంశాలను ప్రస్తావించడంపై కనకమేడల తీవ్ర   అభ్యంతరం.

-అనవసర అంశాలపై ప్రస్తావన తెస్తూ సభను తప్పుదోవ పట్టించడం తగదన్న కనకమేడల రవీంద్ర కుమార్

-సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ కోర్టుల పరిధిలోని అంశాలపై చర్చించడం పై తీవ్ర అభ్యంతరం.

-కోర్టు పరిధిలోని అంశాలపై పార్లమెంటులో మాట్లాడడం ద్వారా కోర్టులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని కనకమేడల అభ్యంతరం.

-విజయసాయిరెడ్డి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ని కోరిన తెలుగుదేశం ఎంపీ.

-ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని వారించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.

-సంబంధిత అంశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా సూచించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్ నారాయన్.

Show Full Article
Print Article
Next Story
More Stories