MP Balli Durga Prasad: తిరుప‌తి ఎంపీ మృతిపై టిటిడి ఛైర్మ‌న్ సంతాపం

- తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుడు శ్రీ బ‌‌ల్లి దుర్గాప్ర‌సాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజ‌న‌ల్ ఇన్‌చార్జ్‌),   శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీ దుర్గాప్ర‌సాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుప‌త్రిలో మృతి చెందారు.

- సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌ శ్రీ దుర్గాప్ర‌సాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్ర‌జ‌ల‌కు విశేష సేవ‌లందించార‌ని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు.

- 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన శ్రీ దుర్గాప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌ట్ల వెనువెంట‌నే స్పందించేవార‌ని నివాళులు అర్పించారు.

- ఆయన మృతి పార్టీకి తీర‌ని లోట‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.     

Show Full Article
Print Article
Next Story
More Stories