Kakinada updates: కుల మత విధ్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించేది లేదు: నయీం అస్మీ..

తూర్పుగోదావరి : కాకినాడ..

-సామాజిక మాద్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన మలికిపురం పోలీసులు..

-జిల్లా ఎస్పీ నయీం అస్మీ మీడియా సమావేశం కామెంట్స్..

-ఈ నెల 15 న రాత్రి 11. గం.లకు మలికిపురం మం. సత్తెమ్మతల్లి గుడి మెట్లు, రైలింగ్ ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు అడబాల రామారావు వీడియో చిత్రీకరించాడు..

-అడబాల రామారావు కు వీడియో తీయడంలో సహకరించి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అడబాల దోరాజీ, ఎనుముల శ్రీనివాస్, బొరుసు తారకప్రభులను అరెస్ట్ చేశాము..

-లారీ ఢీ కొట్టడంతో విరిగిన సత్తెమ్మతల్లి ఆలయం మెట్లు, రైలింగ్ లను తమ కళ్ల ముందే ఎవరో ధ్వంసం చేశారని నిందితులు అసత్య ప్రచారం చేసారు..

-అసత్యాలను ప్రచారం చేసి కుల మత విధ్వేషాలు రెచ్చగొడితే ఉపేక్షించేది లేదు.. కఠిన చర్యలు తప్పవు..

Show Full Article
Print Article
Next Story
More Stories