Jayshankar Bhupallapally District Updates: ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

- మహముత్తరాం మండల కేంద్రంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- పట్టుబడ్డవారంతా గత కొంతకాలం క్రిందట ఛత్తీస్ గడ్ ఇతర ప్రాంతాలనుండి గుట్టుకోయగూడెంకు వలస వచ్చినవారే

- వారి వద్ద నుండి రెండు డిటోనేటర్లు,రెండు జిలేటన్ స్టిక్స్,రెండు టిఫిన్ బాక్స్ లు,పది మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

- సీపీఐ మావోయిస్టు పార్టీ ఏటూరునాగారం, మహాదేవపూర్ ఏరియా దళానికి నాయకత్వం వహిస్తున్న కంకణాల రాజిరెడ్డి&వెంకటేష్&ధర్మన్నకి పేలుడు పదార్థాలు, కరపత్రాలు అందించడానికి వెళ్తుండగా పట్టుబడినారు

- కాటారం డిఎస్పీ బోనాల కిషన్ మాట్లాడుతూ ప్రజలెవరు మావోయిస్టులకు సహకరించకూడదని, ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అలజడులు సృష్టించకూడదని, మావోయిస్టులకు

- సహకరించే వారి గురించి ఎటువంటి సమాచారం తెలిసిన తమకు తెలియజేయాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories