Hyderabad Updates: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

గ్రేటర్ హైదరాబాద్..

# గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

# నేడు 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.

# గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారథి విడివిడిగా భేటీ కానున్నారు.

# ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు.

# ఒక్కో పార్టీకి 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించారు.

# వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై చర్చ

# పోటీ చేసే అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన డిపాజిట్ సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

# ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే ప్రకటించింది.. అభ్యంతరాలు స్వీకరిస్తుంది.

# పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది.

# వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories