Hyderabad updates: హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు..

-హైదరాబాద్‌-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారు..

-ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

-మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు.

-దీనికి బదులు సెవెన్‌ టోంబ్స్‌ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు.

-పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్‌ నుంచి మళ్లిస్తున్నారు.

-మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది.

-దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

-మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ బ్లాక్‌ అయ్యింది.

-ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు.

-మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు

Show Full Article
Print Article
Next Story
More Stories