Dubbaka Updates: ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు....

  సిద్దిపేట జిల్లా //

- దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్ లో టి ఆర్ ఎస్ కు మద్దతు గా తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు

- ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..

- చేగుంట లో తన వ్యవసాయ బావులో ఎండిన పంటను తగలబెట్టి పంట లు ఎండయి అనడం సిగ్గు చేటని షబ్బీర్ అలీ పై మంత్రి హరిష్ రావు పైర్...

- ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం సిగ్గు చేటాని మండి పడ్డారు..

- మీతో ఎంతో అనుబంధం ఉంది.. నాడు ఉద్యమం లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నాం..

- టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వర్గీకరణ కు మద్దతు ఇవ్వాలి అని అసెంబ్లీ తీర్మానం పెట్టి.. కేంద్రానికి పంపితే ఎలాంటి స్పందన లేదు.. తెలంగాణ ప్రభుత్వం   వర్గీకరణ పై పూర్తి స్పష్టత తో ఉంది..

- తెలంగాణ ఉద్యమంలో సింహాల లాగ గర్జించిన ఘనత మాదిగలది..

- కాంగ్రెస్, బిజెపి లు ఇదివరకు చేసింది లేదు.. ఇకముందు చేసేదేమి లేదు..

- అబద్దాలతో దుబ్బాక ప్రజలను మబ్యపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది.

- మిరుదొడ్డి లో బిజెపి కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు రఘునందన్ ..

- ఒక కార్యకర్తను కాపాడుకోలేని అభ్యర్థి రేపు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు..

- పైసలు పోలీసులు తెచ్చిండ్రని నిన్న సిద్దిపేట లో ఆక్షన్ చేస్తే.. అసలు రంగు ఈరోజు బయట పడింది..

- ఆక్టింగ్ లో బిజెపి కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే..

- కెసిఆర్ ప్రభుత్వం లో 230 సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రారంభించారు..

- ఏక కాలంలో 30 మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు

Show Full Article
Print Article
Next Story
More Stories