Cyberabad updates: ఓలెక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న 5గురు వ్యక్తులను అరెస్ట్ చేసాం.

సైబరాబాద్ సీపీ సజ్జనార్...

-వీరంతా భారత్ పూర్ కి చెందిన వాళ్ళు .వీరిపై 40 కేసుల్లో నిందితులు.

-ప్రస్తుతం olx నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు తీవ్రంగా కృషి చేసారు.

-ప్రత్యేక బృందం భరత్ పూర్ కి వెళ్లి నెల పాటు కష్టపడి 5గురిని పట్టుకున్నారు.ప్రధాన నిందితుడు రుక్మిన్ అతని స్నేహితులతో కలిసి olx నేరాలకు పాలడ్డారు.

-నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాము

-రుక్మిన్ తో పాటు ముర్ఫీద్, సైకుల్ ఖాన్, షారుక్, రాఖామ్ ఖాన్ లు ముఠా గా ఏర్పడి ఈ మోసాలు చేస్తున్నారు.

-క్యూ ఆర్ కోడ్ లు పంపి వస్తువులు కోసం రిక్వెస్ట్ పెట్టిన వారిని డబ్బులు పంపమని డబ్బులు గుంజేవారు

-ఆర్మీ అధికారి పేరుతో ...తనకి ట్రాన్స్ఫర్ కావడంతో విలువైన వస్తువులు తక్కువ రేటుకు ఇచ్చేస్తానని సంప్రదించిన వారి నుంచి డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్   ఆఫ్ చేస్తారు.

-ప్రజలు అందరూ olx లో వస్తువులు కొనేటపుడు జాగ్రత్తలు పాటించాలి. వస్తువును చూసి నమ్మకం వచ్చిన తర్వాతే కొనాలి.

-నిందితులు అందరూ రాజస్థాన్ భరత్ పూర్ కి చెందిన వారు.

-వీరి నుంచి లక్ష రూపాయల నగదు 12 ఏటీఎం కార్డులు, 21 సిమ్ కార్డులు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

Show Full Article
Print Article
Next Story
More Stories